మేడారం జాత‌ర : ఆర్టీసీ బంపర్ ఆఫ‌ర్.. 30 మంది ఉంటే బ‌స్సు

-

ఆసియా ఖండంలోనే అతిపెదద్ధ జాత‌ర‌గా పేరు తెచ్చుకున్న మేడారం జాత‌ర వ‌చ్చే నెల 16 నుంచి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే మేడారం జాత‌ర సంద‌ర్భంగా తెలంగాణ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 30 మంది ప్ర‌యాణీకులు ఉంటే.. బస్సు కోరిన చోటికి వ‌స్తుంద‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్ర‌త్యేక బ‌స్సులు కావాల్సిన వారు త‌మ‌కు స‌మీపంలో ఉన్న బ‌స్సు డీపోలో మేనేజ‌ర్ ను సంప్ర‌దించాల‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కోరారు.

అలాగే అమ్మ‌వార్ల గద్దె వ‌ర‌కు టీఎస్ ఆర్టీసీ బ‌స్సులు న‌డుపుతామ‌ని ప్ర‌క‌టించారు. కాగ తెలంగాణ ఆర్టీసీ ని న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించ‌డానికి ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌యాణీకుల అవ‌స‌రాల‌ను బ‌ట్టి ప్ర‌త్యేక ఆఫ‌ర్ ల‌ను పెట్టి క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు. అలాగే టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల‌లో ప్ర‌యాణించ‌డానికి ప‌లువురు ప్ర‌ముఖ‌ల‌తో ప్ర‌చారం కూడా చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. అందులో భాగంగా మేడారం జాత‌ర సంద‌ర్భంగా ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ను ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news