‘కరోనా’కి మందు వచ్చేసింది..! ‘కరోనా’కు చెక్ పెట్టిన హైదరబాద్..!

-

medicine for coronavirus
medicine for coronavirus

ప్రపంచాన్నే గడగడలాదిస్తున్న కరోనా మన దేశాన్ని కూడా పీల్చిపిప్పి చేసింది. ఇప్పటికే ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరోనాని అరికట్టేందుకు శాస్త్రవేత్తలంతా పగలు-రాత్రులు అనే తేడా తెలియకుండా కష్టపడుతున్నారు. ఇక ఈ ప్రమాధకార మహమ్మారిని అరికట్టాలనే అంశాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఓ ఔషదాన్ని తయారు చేశారు.

ఈ ప్రాణాంతక వైరస్ ను అరికట్టేందుకు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ సంస్థ ఔషదాన్ని తయారు చేసిందనే ప్రకటన తెలిసిందే. ఇక ఆ ఔషదాన్ని విక్రయించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) హెటిరో సిప్లా కంపెనీలకు అనుమతి పత్రాలను మంజూరు చేసింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరతో కోవిఫర్ 100 ఎం‌జీ అనే పేరుతో ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో రాబోయే రెండు వారాల్లో పూర్తిస్థాయిగా అందుబాటులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హెటిరో సంస్థ హైదరబాద్ కు చెందిన సంస్థ అయినందున కరోనా యాంటీ డ్రగ్ ను కనిబెట్టిన ఘనత హైదరబాద్ కు దక్కడం గమనార్హం..!

Read more RELATED
Recommended to you

Latest news