పారితోషికం ఎక్కువ తీసుకుంటుంది నలుగురే.. మెగాస్టార్ చిరంజీవి..

-

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం, ఈ నెల24వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మేరకు ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సహా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హీరోల పారితోషికం గురించి, సినిమా వాళ్ళ సంపాదన గురించి తప్పుగా అనుకుంటున్నారని, ఇండస్ట్రీలో అందరూ పెద్ద పారితోషికాలు తీసుకోవట్లేదని, కేవలం నలుగురైదుగురే మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని, అందరు డైరెక్టర్లు, హీరోలు బాగా సంపాదిస్తున్నారని అనుకోవద్దని అన్నారు.

ఇంకా, ఇండస్ట్రీ సాధక బాధకాలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, సమస్యలను పరిష్కరించడమ్లో ప్రభుత్వాలు చొరవ చూపిస్తే బాగుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయాలంటే ఆలోచించాల్సి వస్తుందని మెగాస్తార్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news