మెట్రో రెండోదశకు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

-

హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఐకియా చౌరస్తా వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.

శంకుస్థాపన అనంతరం తెలంగాణ పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొంటారు. రెండో దశలో 31 కిలోమీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణానికి రూ.6,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news