IPL MI vs LSG : ముంబైకి మ‌రోసారి భంగ‌పాటు.. 18 ప‌రుగుల తేడాతో ఓట‌మి

-

ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ కు మ‌రో సారి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే ఐదు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉన్న ముంబై.. తాజా గా మ‌రో సారి ఓడింది. దీంతో డ‌బుల్ హ్యాట్రిక్ ఓట‌ములు చ‌వి చూసిన ఐపీఎల్ జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. ల‌క్నో ఇచ్చిన 200 భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో ముంబై బ్యాట్స్ మెన్లు త‌డ‌బ‌డ్డారు. ఓపెన‌ర్లు.. రోహిత్ (6), ఇషాన్ కిషన్ (13) తో మ‌రోసారి విఫ‌లం అయ్యారు. జూనియ‌ర్ ఏబీగా పేరు ఉన్ డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

అలాగే సూర్య కుమార్ (37), తిల‌క్ వ‌ర్మ (26), పోలార్డ్ (25) స్వ‌ల్ప ప‌రుగులు మాత్ర‌మే సాధించారు. దీంతో ముంబై భారీ టార్గెట్ ముందు తెలిపోయింది. 9 వికెట్లు కోల్ప‌యిన ముంబై.. 18 ప‌రుగుల తేడాతో ఓడింది. దీనికి ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో.. కెప్టెన్ రాహుల్ (60 బంతుల్లో 103 నాటౌట్) రాణించాడు. 9 ఫోర్లు, 5 సిక్స్ లు బాదాడు. రాహుల్ కు తోడుగా డికాక్ (24), మ‌నీష్ పాండే (38) చేశారు. దీంతో 199 ప‌రుగులను చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news