షూటింగ్ పూర్తి చేసుకున్న సందీప్ కిషన్ “మైఖేల్”

-

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సందీప్ కిషన్. సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ టెర్రిఫిక్‌గా అనిపించింది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 3న రిలీజ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news