మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త..జీతాలు పెంచుతూ నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54231 మంది బుక్ కం హెల్పర్లు గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వీరికి ప్రస్తుతం గౌరవ వేతనం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అని దానిని మూడు వేలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 27 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా… 34 వేలకు పైగా ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని.. ఈ విషయాన్ని ఆర్బీఐ చెబుతోందన్నారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వ పథకాలు లబ్ది దారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగరజారడానికి కరోనా సాకు సాదన్న కేసీఆర్‌… కరోనా కంటే ముందే దేశాభివృద్ది రేటు దిగజారిందని ఆరోపించారు. ప్రస్తుతం ఇండియా అప్పు రూ.152 కోట్లు ఉందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news