విజయవాడలో అర్థరాత్రి కాల్పుల కలకలం..పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి దారుణ హత్య..!

-

గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ శివారులో అర్థరాత్రి మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది..విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు..నిన్న అర్థరాత్రి బైపాస్‌ రోడ్డులో ఉన్న బారు వద్ద ఈ ఘటన జరిగింది..నిందితుడు మహేష్ గత కొన్ని రోజులుగా భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు..ఆర్థరాత్రి మద్యం తాగి డబ్బులు చెల్లించకపోవడంతో బారులో గొడవ జరిగినట్లు సమాచారం..ఈ నేపథ్యంలో దుండగులు మహేష్‌ను తుపాకీతో కాల్చి చంపినట్లు…మరో వైపు మహేష్‌ను పథకము ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..ఘటన స్థాలన్ని విజయవాడ సీపీ పరిశీలించారు..నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news