ఆ ఊరిలో పాలు అస్సలు అమ్మరు..కారణం ఏంటో తెలుసా?

-

ఈరోజుల్లో మంచి నీల్లకు కూడా భలే గిరాకీ ఉంది.. ఊరికే ఏది రాదు..ఇక పాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు.. పాలకు మంచి డిమాండ్ ఉంది.. ఎక్కడ చూసిన లీటరు 70 నుంచి 80 పైగా పలుకుతోంది.. అలాంటి ఖరీదైన పాలను ఊరికే పొయ్యడం అంటే మాటలు కాదు..కానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊరిలో పాలను ఉచితంగా ఇస్తున్నారు..నిజంగా అలాంటి ఆలోచన రావడం నిజంగా గ్రేట్ కదా.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఊరి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

కర్నూలు జిల్లాలోని సంద్యాలలో పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు అమ్మకూడదు..

పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు. ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు..

పెద్దలు మాకు పాలను ఉచితంగా ఇచ్చే పద్ధతిని నేర్పారు. అందుకే పాడి ఉన్నంత వరకు పాలు, మజ్జిగ చుట్టు పక్కల వారి అవసరాలకు ఉచితంగానే పోస్తుంటాం. నెయ్యి మాత్రం పాణ్యం వెళ్లి అమ్ముకుంటాం. అది కూడా పండగ వచ్చే ముందు ఏడాదికి ఒకసారి.ఈ ఆచారం తాతల కాలం నాటి నుంచి వస్తుంది..పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తామని అక్కడి జనాలు అంటుండటం విశేషం..ఇలా అందరూ పాటిస్తే ఎంత బాగుండో..

Read more RELATED
Recommended to you

Latest news