రెచ్చిపోతున్న మజ్లిస్.. మేము గెలిస్తే పాతబస్తీ గల్లీలలో మిమ్మల్ని తిరగనివ్వం .

-

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం జోరు పెంచింది. ఒక పక్క ఓవైసీ సోదరులు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ తమ ముస్లిం సమాజం జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేమున్న తక్కువ తిన్నామా అన్న రీతిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రత్యర్థి పార్టీల వారిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులని మజ్లిస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

మేము గెలిస్తే పాతబస్తీ గల్లీలలో మిమ్మల్ని తిరగనివ్వమని మజ్లీస్ గెలిస్తే ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతుకాన్నివ్వరని వారు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న ఇక్కడ స్థిరపడి ఉన్నా సరే మా ఏరియా లో నుండి వెళ్లిపోక తప్పదని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ బహిరంగ సభలో కిషన్ బాగ్ మజ్లిస్ అభ్యర్థి హుస్సేన్ పాషా హెచ్చరించడం కలకలం రేపుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news