ఈనెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు : మంత్రి ఆదిమూలపు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఏపీ పాఠశాలల్లో ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.

వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా సోమవారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఒంటి పూట బడుల నిర్వహణ నేపథ్యంలోనే.. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని చెప్పారు మంత్రి ఆదిమూలపు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. మే 6 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూనే నిర్వహిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news