రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది : మంత్రి అమర్నాథ్‌

-

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం రాబోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

YSRCP MLA Gudivada Amarnath slams at GITAM, says they are in thirst of  govt. lands

కళ్లు తెరిచి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబడుతుందన్నారు.ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్ ప్రాణహాని ఉందంటున్నారు. పవన్ కు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉంటుందని వెల్లడించారు.చంద్రబాబు ఏం చెబితే అది పవన్ మాట్లాడుతున్నారని, టీడీపీలో సెకండ్ క్యాడర్ నేతలు అనుమానాస్పదంగా చనిపోయారని విమర్శించారు. వాళ్ల మృతిపై ఎవరిని అనుమానించాలని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news