తల్లిని తిడితే.. ఉప్పు, కారం తినే వారు ఎవరూ ఊరుకోరు : మంత్రి అనిల్‌

-

మంత్రి అనిల్ కుమార్ మరోసారి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం లో ఉండటం దౌర్భాగ్యమని.. చంద్రబాబు నాయుడు ,ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ని అనరాని మాటలు అన్నారని ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి ని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరని హెచ్చరించారు. గుంటూరు జిల్లా లో ఉప్పు ,కారం ఎక్కువగా తింటారు.. కాబట్టి పౌరుషం ,రోషం ఎక్కువగా ఉంటాయని చెప్పారు.

ఒక పక్క గిచ్చడం మరోపక్క మాపై దాడి చేశారు అని దొంగ దీక్షలు చేయడం దారుణమన్నారు. అబ్బా , కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రం లో ఎవ్వరు ఏమి పికలేరని…. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ తో ఏపీకి ఎటువంటి సంబందం లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

డ్రగ్స్ ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు కనిపిస్తాయని… డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని వైసీపీ పై రుద్దడం దారుణమని నిప్పులు చెరిగారు. ఏ రోజు అయిన ప్రజా సమస్యలపై పోరాటం చేసారా.. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప…? అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నాం మీలా హైదరాబాద్ లో దాక్కోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news