చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ను విడదీసే ఆలోచన జగన్‌ కు లేదు : మంత్రి బాలినేని

-

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ను విడదీసే ఆలోచన జగన్‌ కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ ను చిరంజీవి కలిసింది… కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని… అలా ఎందుకు చేస్తారో కూడా అర్ధం కాదని ఫైర్‌ అయ్యారు.

కేవలం సినిమా వాళ్ళ కోసం చిరంజీవి వస్తే ఏదో ఒకటి పులిమే దానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ కు అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన లేదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ ఒంటరి గానే పోటీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు దళితులు, కాపుల మధ్య చిచ్చుపెట్టే దానికి ప్రయత్నిస్తాడు.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు..కానీ ఎవరికి ఏమి చేయడని పేర్కొన్నారు. చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి వారి తరఫున వచ్చి సీఎం జగన్ తో సినిమా వాళ్ళ బాగోగుల కోసం వచ్చారని తెలిపారు బాలినేని. సీఎం జగన్ సినిమా వాళ్ల కోసం చేయగలిగినంత చేస్తారని ప్రకటన చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news