చంద్రబాబు బాత్రూం కు వెళ్లి ఆహారం తినివస్తాడు… మంత్రి షాకింగ్ కామెంట్స్..!

-

చంద్రబాబు దీక్షపై మంత్రి బాలినేని షాకింగ్ కామెంట్స్ చేశాడు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ దీక్షలు..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 36 గంటల దీక్ష అంటున్నా 12 గంటలు కూడా సరిగ్గా చేయలేడు అంటూ విమర్శించారు. బాత్రూంకు వెళ్లి తినేసి వస్తాడు..గతంలో దీక్షలు చేసిన సమయంలో కూడా ఆయనకు సుగర్ లెవెల్స్ పెరిగాయి…అంటూ బాలినేని ఆరోపణలు చేశారు. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేస్తున్నారని…అధికారం లోకి తిరిగి రాలేమనే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ మండి పడ్డారు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు లేరు..అంటూ బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును బొస డీకే అంటే ఊరుకుంటారా…? అంటూ బాలినేని ప్రశ్నించారు. బొస డీకే అంటే అర్ధం తెలుసా..ఘోరమైన మాటలు మాట్లాడటం దారుణమని అన్నారు.

ఉదయం చంద్రబాబు ఇంట్లో ఉన్న పట్టాభి.. సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే అభిమానులు ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఆయన ఒక్కడే మగాడా.. ఇంకెవరు లేరా..పోసాని పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే ఆయన అభిమానులు ఎందుకు దాడులు చేశారు..అంటూ బాలినేని ప్రశ్నించారు. గతంలో జగన్ ఎప్పుడు మీలా బూతులు మాట్లాడలేదని అన్నారు. గతంలో ఒంగోలులో కార్యక్రమాల్లో పాల్గొనాలంటేనే అడుగు పెట్టనివ్వని పరిస్థితి సృష్టించారని బాలినేని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news