లోకేష్ ఓ లోఫర్…మంత్రి బొత్స సంచలనం

-

రామతీర్ధంలో పర్యటించిన మంత్రి బొత్స లోకేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఓ లోఫర్ అని పేర్కొన ఆయన రాళ్లు విసిరినా సంయమనం పాటించామని అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టు కోవాలని పేర్కొన్న బొత్స రాష్ట్రంలో దేవాలయాల ఘటలన్ని చ్రంద్రబాబు సారధ్యంలో జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబుని దోషిగా నిరూపిస్తామన్న ఆయన రాజకీయాల్లో శాస్వతంగా లేకుండా చేస్తామని రాముని సాక్షిగా చెబుతున్నానని అన్నారు.

రామతీర్థం ఘటన పై బాధ పడుతున్నామని ఇది క్షమించరాని నేరం..తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు. చంద్రబాబు ఆక్రోశంతో శాపాలు పెడుతున్నారని, ఇక్కడికి వచ్చి అమరావతి కోసం మాట్లాడారు..అమరావతి ని దోచుకుతిన్నారని అన్నారు. తండ్రి,కొడుకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో మతకల్లోలు సృష్టించాలనికొంతమంది  చూసున్నారని అన్నారు. మా ఎంపీ విజయ సాయి రెడ్డి పై దాడి చేయించారన్న ఆయన చంద్రబాబు జిమ్మికులు అందరికి తెలుసు..ఖబడ్ధార్ అంటున్నారు..దేనికి? చంద్రబాబు భాష ఏమిటి..ఆ మాటలు ఏంటి? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news