గవర్నర్ తమిళిసై పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

-

గవర్నర్ తమిళసై పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ఈ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తు‌న్నారని ఆరోపించారు. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఇలాంటి గవర్నర్ ను ఇప్పటివరకు చూడలేదన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఆమెకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. అంతపెద్ద సెక్రెటరియేట్ నిర్మాణం కనిపించడం లేదా?.. అది అభివృద్ధి కాదా? అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరుగుతోందా? అని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి. రైతు సంక్షేమ రాష్ట్రంలో గవర్నర్ కు ఆత్మహత్యలు కనిపిస్తున్నయా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news