సినీ గేయ రచయిత కందికొండ కుటుంబానికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

-

సినీ గేయ రచయిత కందికొండ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా.. ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మాట్లాడి ఆర్థికసాయం అందిస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్.

కాగా గత కొంత కాలంగా గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో చికిత్సకు తన ఆర్థికపరిస్థితి సహకరించడంతో మంత్రి కేటీఆర్ మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కోసం ఆర్థికంగా… సహాయం కావాలని మంత్రి కేటీఆర్ కు… కందికొండ కుమార్తె లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news