గ్రేటర్‌ ఎన్నికల పై కేటీఆర్ ఫోకస్..ఎమ్మెల్యేలతో భేటీ

-

గ్రేటర్ ఎన్నికల పై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.గ్రేటర్ ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజులగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న గ్రేటర్ పరిధిలోని అయిదుగురు ఎమ్మెల్యేలతో భేటి అయిన కేటీఆర్ ఈరోజు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం లో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న అంశం పై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు కేటీఆర్.

గ్రేటర్ పరిధిలోని సమస్యలు,డివిజన్ల వారీగా పరిస్థితిని ఎమ్మెలతో సమీక్షిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని డివిజన్లలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల కూడా ఈరోజు ఆ దిశగానే కామెంట్స్ చేశాడు. బస్తీల్లో నిరుపేదలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మంత్రి ఈటల.

Read more RELATED
Recommended to you

Latest news