ఏపీ రైతులకు శుభవార్త..ఎలాంటి భారం లేకుండా ఉచిత విద్యుత్

-

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. రూ.4.30 కోట్లతో అత్యాధునిక సాకేంతికతతో నిర్మాణం చేసినట్లు తెలిపారు. స్థలాభావం ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా సబ్ స్టేషన్లతో మేలు జరుగుతుందని.. త్వరలో అన్నవరం దేవస్థానం వద్ద రెండో కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణం అని పేర్కొన్నారు.

సబ్ స్టేషన్లతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని.. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు ప్రాధాన్యం అని వివరించారు. స్మార్ట్ మీటర్ల పై టీడీపీ, కమ్యూనిస్ట్ లు రాజకీయం చేస్తున్నారు.. రైతులపై ఎటువంటి భారం లేకుండా ఉచిత విద్యుత్ అని ప్రకటించారు. డిబిటి విధానంలో రైతుల ఖాతాలకే బిల్లులు జమ అని.. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాదన్నారు. అర్థం చేసుకుంటున్న రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news