చంద్రబాబు ఫ్యూజులు ఎగిరిపోయాయి.. మెంటల్‌ బ్యాలెన్స్ పడిపోయింది : మంత్రి రోజా

-

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హత్య చేయాల్సిన పని మాకు లేదని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం తిరుపతి జిల్లా క్రీడా సంబరాలు ప్రారంభం కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం మాట్లాడుతూ.. చంద్రబాబు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడం ఇదేం కర్మ రా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు అన్నారు. చంద్రబాబును చూసి ఇదేం కర్మ రా బాబు అనుకుంటున్నారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

Balakrishna & Chandrababu speaking blatant lies, says Roja

చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని… ఆయనకు ఫ్యూజులు ఎగిరిపోయాయని, మెంటర్ బ్యాలెన్స్ పడిపోయిందని చెప్పారు. ఎమ్మెల్యే అవడమే కష్టం అనుకుంటున్న లోకేశ్ ను సీఎం చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తండ్రిలాంటి ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తమను చంపాలనుకుంటున్నారని చెపుతూ సింపథీ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. వీరు ముగ్గురినీ చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news