ఎలుక చేసిన పనిపై స్పందించిన తెలంగాణ మంత్రి

-

మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో చికిత్స కోసం భూక్య రెడ్యా అనే రైతు దాచుకున్న రెండున్నర లక్షల డబ్బులను ఎలుకలు కొట్టిన సంగతి తెలిసిందే.  ఈ  వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యం లోనే  తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ ఘటన పై స్పందించారు.

దిక్కు తోచని స్థితిలో ఉన్నభూక్య రెడ్యాకు ఫోన్ చేసి మరీ భరోసా కల్పించారు మంత్రి సత్యవతి రాథోడ్.  రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని ఈ సందర్భంగా చెప్పిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో చికిత్స కు అయిన ఖర్చును కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. మహబూబాబాద్ తహశీల్దార్ రంజిత్ రైతు రెడ్యా వద్దకు వెళ్లి ఎలుకలు కొట్టిన నోట్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news