కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!

-

ఇందిరమ్మ ఇండ్ల పథకం పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా మంత్రి ఉత్తమ్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఉత్తమ్.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లులేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు.

తాము 11 మందిమి కలిసి క్రికెట్ టీమ్  కలిసికట్టుగా పని చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. మూడు స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందన్నారు. ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని.. బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news