మైనర్ బాలిక కిడ్నాప్.. 3 నెలలుగా గ్యాంప్‌రేప్!

-

జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రహస్య ప్రాంతంలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలపాటు అత్యాచారం చేశారు. ఓ మహిళ ద్వారా పోలీసులకు సమాచారం అందటంతో.. పోలీసులు ఘటనా స్థలానికి మైనర్ బాలికను రక్షించారు.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని బొకారోలో ఏప్రిల్ 20వ తేదీన బాలికను ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి మూడు నెలలుగా అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఆ ఇంటి నుంచి వెళ్తున్న ఓ మహిళ బాలిక అరుపులు వింటుంది.

దీంతో ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు.. త్వరలో ముగ్గురిని అరెస్ట్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news