ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. రోడ్డు మార్గం లేక నిండు గర్భిణి మృతి

-

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన అందరినీ కలచివేసింది. సరైన రోడ్డు మార్గం లేక నిండు గర్భిణి మృతి చెందింది. కొనిగోడు గ్రామంలో జరిగిన ఈ సంఘటన హృదయ విదారకరమైనది. విస్తారంగా కురిసిన వర్షాల మూలంగా పొంగిన వాగు తొమ్మిది నెలల నిండు గర్భిణిని బలి తీసుకుంది. ఇంతకీ జరిగిన విషయానికి వస్తే, కొనిగోడు గ్రామంలోని రాజు భాయ్ అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళదామని అంబులెన్సుకి ఫోన్ చేసినప్పటికీ వాగు పొంగుతుండడంతో ఊర్లోకి అంబులెన్స్ రాలేకపోయింది. దాంతో చేతుల మీద ఆమెను ఎత్తుకుని వాగు దాటించిన అక్కడి వారు అంబులెన్స్ లో ఎక్కించారు.

అక్కడ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ కి సిఫార్సు చేసారు వైద్యులు. ఆ తర్వాత పురిటి నొప్పులు ఎక్కువ అవడం, సరైన సమయానికి తీసుకురాలేకపోవడం కారణంగా రాజుభాయ్ ఆదిలాబాద్ లో చనిపోయింది. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లి, బిడ్డతో పాటే మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news