“సబ్బం హరి”ని “గుడివాడ” వాయించిన విధంబెట్టిదనిన..!

-

తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకని.. అందుకే తాను ఆక్రమించుకున్న భూమిని అధికారులు లాక్కున్నారని చెప్పుకొస్తున్నారు సబ్బం హరి! జగన్, విజయసాయిరెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఫైరయ్యారు. మరి ఈ విషయంలో కోర్టుకు వెళ్లొచ్చు కదా అని అడిగినవారికి మాత్రం.. సబ్బం మౌనమే సమాధానం! ఇలా సబ్బం హరి చేస్తున్న పొలిటికల్ డ్రామాపై నిప్పులు చెరిగారు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్!

సబ్బం హరిని ఈ రేంజ్ లో ఎవరూ తిట్టి ఉండరేమో అన్నరీతిలో చెలరేగిన గుడివాడ అమర్నాథ్… సబ్బం హరి మళ్లీ మాట్లాడలేరు అన్నట్లుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు! ముందుగా… సబ్బం హరి పార్క్ స్థలాన్ని అక్రమించారు.. ఆయన ఆధీనంలో సుమారు రూ. 2కోట్ల విలువైన భూమిని జీవీఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. అని వివరణ ఇచ్చారు అమర్నాథ్! అనంతరం ఫైరయ్యారు!

“నాకు తెలిసి సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్.. జై సమైక్యాంధ్ర పార్టిలో ఆయన ఏం చేశారో ప్రజలకు తెలుసు.. అవినీతికి అన్న చంద్రబాబు, తమ్ముడు సబ్బం హరి..” అని మొదలుపెట్టిన అమర్నాథ్…. “సబ్బం హరి భాష అభ్యంతరకరంగా ఉంది.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి.. లేకుంటే వైఎస్ జగన్ సైనికుడిగా సబ్బం హరి ఇంటికి వెళ్లి మరీ నాలుక కోస్తా.. విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే అర్హత నీకుందా సబ్బం?” అంటూ నిప్పులు చెరిగారు!

అనంతరం బాబు – టీడీపీని టార్గెట్ చేసిన అమర్నాథ్… “అవినీతిలో పెద్ద నేతలకు టీడీపీలో ఉన్నత పదవులు వస్తాయి.. అచ్చెం నాయుడు, కొల్లు రవీంద్రకు పార్టీ పదవులు ఇవ్వడం చంద్రబాబు నీతికి అర్ధం పడుతోంది..” అని ఫైరయ్యారు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version