మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంట తీవ్ర విషాదం !

-

మంగళగిరి ఎమ్మెల్యే వైసీసీ కీలక నేతగా ఉన్న ఆర్కే అలియాస్ ఆళ్ల రామ కృష్ణా రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథ రామి రెడ్డి ఈరోజు కన్ను మూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దశ రథ రామి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.

YSRCP MLA RK Complains To Police Over Threats On Social Media
YSRCP MLA RK Complains To Police Over Threats On Social Media

దశ రథ రామి రెడ్డి కి ఇద్దరు కుమారులు కాగా అందులో రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు ఆళ్ల అయోధ్య రామి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన రాంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొదలు పెట్టి రియల్ ఎస్టేట్, బిల్డర్స్, ఫార్మా తదితర రంగాల్లో రాణిస్తున్నారు. ఇక వీరి తండ్రి మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news