విజయవాడ బ్లాస్ట్ కు కారణం ఇదే.. తేల్చిన పోలీసులు !

-

విజయవాడ శివారు సూరంపల్లిలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన పేలుడుకు కారణాలను పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ డోర్లకు షైనింగ్ పెట్టడానికి వినియోగించే రేజీనం అనే లిక్విడ్ కారణంగా పేలుడు సంభవించిందని ప్రాథమికంగా తేలింది. ఈ రేజీనం అనే లిక్విడ్ ని పెద్ద డబ్బాల్లో నిల్వ ఉంచాల్సి ఉంది. కానీ ఈ జయరాజ్ ఎంటర్ ప్రైజెస్ యజమాని 100 లీటర్ల సరుకుని అంతే పట్టే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచాడు.

అయితే దీని వల్ల ఆ డబ్బాలో ప్రమాదకరమైన గ్యాస్ తయారైనట్టు పోలీసులు గుర్తించారు. షాపులో ఉన్న స్క్రాప్ తీసుకువెళ్లేందుకు వచ్చిన తండ్రీకొడుకులు ఈ డబ్బాను పగలకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడే చనిపోయారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు… 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సంఘటనాస్థలంలో పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. ఇక జయరాజ్ ఎంటర్ ప్రైజెస్ కు అనుమతులు లేవని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news