అమ‌ర‌రాజాపై బిగ్ బాంబ్ పేల్చిన రోజా

-

టీడీపీపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌ అయ్యారు. అమర రాజా విషయంలో టిడిపి విష ప్రచారం చేస్తోందని..అది రాజకీయ సమస్య కాదు కాలుష్యం సమస్య అని చెప్పారు. ఎల్జీ పాలిమర్ విషయంలో చంద్రబాబు ఎం మాట్లాడాడు ??? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే ..చంద్రబాబు నాయుడు అండ్ పచ్చ బ్యాచ్ అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందని.. కాలుష్యంతో అనారోగ్యం బారినా పడినా వారికి వైద్య చేయించవచ్చుగా‌‌‌‌ అని చురకలు అంటించారు. బాబు అండ్ టీం వెళ్ళి నిజానిర్ణారణ కమిటీ వేసి తప్పులేదని నిరూపించండి‌…చూద్దామని రోజా సవాల్‌ విసిరారు.  గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైందని… అమర్ రాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం అడుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలను శిరస వహించి అమర రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలని… తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు… భారతీ సిమెంట్స్ పై చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా సార్లు దాడులు చేయించారని.‌‌… ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కనపడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news