తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జనాగ్రహ దీక్ష లో ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఆపిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మండి ప‌డ్డారు. ప్రధానమంత్రి కావాలని మోడీ తో పోటీపడి పూర్తిగా దిగజారిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. వయసు పెరగడంతో చంద్రబాబుకు మతి పోయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మేటర్… మోటార్ లేని వ్యక్తి నారా లోకేష్ పప్పు నాయుడు అంటూ వంశీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీరామారావు పై చెప్పులు రాళ్లు దాడి చేసి ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్టీఆర్ శాపం తగిలి నీ కుటుంబం రాజకీయ జీవితానికి ఎందుకు పనికిరాకుండా పోయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని ఆ పార్టీ ని పట్టిపీడిస్తున్న తుప్పు నాయుడు పప్పు నాయుడు అంటూ వంశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news