జగన్ సర్కార్ కు షాక్..కలెక్టర్ కు వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు

-

జగన్‌ సర్కార్‌ కు షాక్ ఇస్తూ..వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక నిర్నయం తీసుకున్నాడు. తన నియోజక వర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోం దని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు ఎమ్మెల్యే వసంత. మార్చి 31న కలెక్టర్ కి లేఖ రాశారు ఎమ్మెల్యే వసంత. సొంత పార్టీ నేతలే మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చర్చగా మారింది ఎమ్మెల్యే వసంత లేఖ.

మైలవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా మైనింగ్ విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ వల్ల పోలవరం కెనాల్ సమీపంలో పలు చోట్ల దెబ్బతినే అవకాశం ఉందని.. అక్రమ మైనింగ్ జరగకుండా ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖలకు ఆదేశాలు ఇవ్వండని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, జక్కంపూడి, పోలవరం కెనాల్ ప్రాంతాల్లో తనిఖీలు చేయండని కోరారు. జిల్లా కలెక్టర్ తోపాటు ఇరిగేషన్ ఎస్ఈ, మైనింగ్ డిడికి పిర్యాదు చేశారు ఎమ్మెల్యే వసంత.

 

Read more RELATED
Recommended to you

Latest news