ఉపాధ్యాయుడి మృతి.. పాడె మోసిన ఎమ్మెల్యేలు

-

స్నేహమేరా జీవితం అంటుంటారు. నమ్మిన స్నేహితుడి కోసం ప్రాణం అయినా ఇవ్వడం, ఆ స్నేహితుడి కోసం ఎంత వరకు అయినా తెగించడమే నిజమైన స్నేహం అని చెప్పచ్చు. కష్టాల్లో ఉంటే… ఆ స్నేహితుడి కోసం ఏదైనా చెయ్యాలి… అయితే చాలా మంది స్నేహితులు ఈ రోజుల్లో తమ స్నేహితులను కాపాడుకోవడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదు. స్నేహంలో లాభం చూడటం మినహా కష్టం వస్తే నిలబడటానికి ముందుకి వచ్చే వారు కాదు.

ఇక ప్రాణాపాయంలోనో ప్రమాదంలోనో ఉంటే సహాయం చేయడానికి మానవత్వంతో కనీసం ముందుకి రావడం లేదు. కానీ తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రకాశ్ గౌడ్ అనే ఉపాద్యాయుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోగా అంతిమ యాత్రలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ లు పాడె మోశారు. అయితే వీరు అంతా కలిసి చదువుకున్నట్టు తెలుస్తోంది. తమ స్నేహితుడు మరణించాడని తెలుసుకున్న ఎమ్మెల్యేలు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. విషణ్ణ వదనాలతో అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అంతకుముందు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news