వీధి వ్యాపారుల లోన్లు పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ..

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం రోజున వీధి వ్యాపారులకి లోన్లు పంపిణీ చేయనున్నారు. 3లక్షల మంది వీధి వ్యాపారులకి స్వనిధి లోన్లు పంపిణీ చేయనున్నారు. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆర్మ నిర్భర నిధి యోజన కింద ఈ లోన్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం జరగనుంది. లోన్ కి నమోదు చేసుకున్న వీధి వ్యాపారికి 10వేల రూపాయల లోన్ ఇవ్వనున్నారు.

భారత దేశంలో ఉత్తర ప్రదేశ్ నుండి ఎక్కువగా ఈ లోన్ కొరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఉత్తరప్రదేశ్ నుండి 5,57,000 మంది అప్లై చేసుకున్నారు. వ్యాపారులకి వ్యాపారానికి కావాల్సిన సేవలు అందించడంతో పాటు నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news