రైతులకు షాక్ ఇచ్చిన మోదీ..ఆ లిస్ట్ లో మీ పేరు ఉంటే డబ్బులు వాపసు..

-

దేశంలోని అన్నదాతల అభివృద్ధి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి.ఈ పథకం కింద ప్రతీ సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తుంది. ఏడాదికి 3 సార్లు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, పెట్టుబడికి కష్టాలను కొంతమేర తీర్చుతుంది. అయితే ఈ పథకంలో అర్హత లేని అన్నదాతలు ఎంతోమంది ఉన్నారంటూ, పలు నివేదికలు వెలవడ్డాయి..ఈ విషయం పై సీరియస్ అయిన మోదీ సర్కార్ త్వరలోనే వారికి షాక్ ఇవ్వనుంది.

*. ఈమేరకు అర్హత లేని అన్నదాతలు పొందిన ఆర్థిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

*. అర్హత లేకుండా సహాయం పొందితే, కచ్చితంగా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందేనని, లేదంటే మున్ముందు వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది.

*. అన్నదాతలకే ఓ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే తగిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెల్లి, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో ‘రీఫండ్ ఆన్‌లైన్’ అనే ఆఫ్షన్ ఉంటుంది..దాని మీద క్లిక్ చేసి వివరాలు చెక్ చేసుకొవాలి.

*.బ్యాంక్ ఖాతా నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సబ్మిట్ చేశాక, ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే మెసేజ్ కనిపిస్తే.. ఆర్తిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాకాకుండా ‘రీఫండ్ అమౌంట్’ అనే ఆప్షన్ కనిపిస్తే ఆర్థిక సహాయాన్ని తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలోనే ఓ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news