చిరంజీవి నాగార్జునపై మోడీ తెలుగులో ట్వీట్…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా చాలా కష్టాలు పడుతున్నాయి. కరోనా ఏ విధంగా కట్టడి అవుతుందో అర్ధం కాక చాలా దేశాలు ఇప్పుడు భయంతో బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనితో మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఎవరికి వారు గా ముందుకి వచ్చి ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే తెలుగు సిని పరిశ్రమ కూడా కరోనా వైరస్ మీద ఎక్కువగా ప్రచారం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునా ఇలా అందరూ ముందుకి వస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో రికార్డ్ చేసి వదిలారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు ఒక పాట చేసారు.

ఈ పాట మోడీ కూడా చూసారు. దీన్ని చూసిన మోడి తెలుగులో ట్వీట్ చేసారు. చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామని ఆయన ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూసిన మెగా ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news