తీన్మార్ మల్లన పై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు.. 300 ముక్కలు నరుకుతాం ! !

-

నిజామాబాద్ : తీన్మార్ మల్లన పై బోధన్ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ కుటుంబం పై మరో సారి.. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు చేస్తే.. ముక్కలు ముక్కలుగా నరికేస్తామని ఓ రేంజ్‌ లో వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ రిపీట్ అయితే మూడు వందల ముక్కలుగా నరికేస్తామని సంచలన వ్యాక్యలు చేశారు ఎమ్మెల్యే షకీల్. ఎక్కువ మాట్లాడితే నేనే ఇంటికి వచ్చి కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు షకీల్‌.

క్రమశిక్షణ గల పార్టీ అని.. బిజెపి నాయకులు చెబుతున్నారని… మరి తీన్మార్ మల్లన్న కి నేర్పేది ఇదేనా అని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటే శక్తి అని.. తమ పార్టీ కార్యకర్తలు తలచుకుంటే.. మీ పని అయినట్లనేనని హెచ్చరించారు. . కాగా… నాలుగు రోజుల కిందట… మంత్రి కేటీఆర్‌ తనయుడు.. హిమాన్షు పై తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్‌ ఎస్‌ నేతలు తీన్మార్‌ మల్లన్నపై దాడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news