బ్రేకింగ్ :మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం

-

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంచు మోహన్‌ బాబు సొంత తమ్ముడు రంగ స్వామి నాయుడు మృతి చెందారు. కాసేపటి క్రితమే రంగ స్వామి నాయుడు ఆస్పత్రి లో మరణించినట్లు సమాచారం అందుతోంది.  తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.

రంగ స్వామి నాయుడు వయస్సు 63 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రంగ స్వామి నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగ స్వామి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు. ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన అంత్య క్రియలు గురువారం తిరుపతిలో జరుగనున్నాయి.  ఇక ఈ ఘటన గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news