దారుణం : ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేసిన కన్న తల్లి..

-

అక్రమ సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేసేస్తున్నాయి. తన పడక సుఖం కోసం ఎంతకు అయినా తెగించేస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరూ ఇందుకు అతీతులు కాదు. పరాయి పురుషుల మోజులో పడిన మహిళలు భర్తలను, పిల్లలని చంపేస్తున్నారు. పురుషులు ఏమో భార్యలను, పిల్లలని చంపేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసింది కన్న తల్లి. అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడుతో నివసించం మొదలు పెట్టింది.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండు రోజుల క్రితం చిన్నకొడుకుని హత్య చేసింది ఉష. దీనికి ఆమె ప్రియుడు సహకరించాడు. గుట్టుచప్పుడు కాకుండా మృదాదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చిపెట్టి వచ్చారు నిందితులు. రెండు రోజుల నుండి బాలుడు కనపడక పోవడం అయినా తల్లిలో ఎలాంటి బాధ లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉషని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా విచారణలో హత్య చేసినట్టు తేలింది. దీంతో ఉషను ప్రియుడు శ్రీనును అరెస్ట్ చేసిన జగ్గయ్య పేట పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news