వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఎమ్ ఎస్ ధోనీ..

-

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా భారత్ కి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ తో పాటు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన ధోనీ ఎన్నో మర్చిపోలేని విజయాలని అందించాడు. కెప్టెన్ కూల్ గా అతడు ఫినిష్ చేసిన మ్యాచులు అందరికీ గుర్తే. ఐతే కొద్ది కాలం క్రితం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి వైదొలుగుతున్నానంటూ ధోనీ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయినా కానీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఈ ఏడాది టోర్నమెంట్ ఆడుతున్నాడు.

రిటైర్ మెంట్ అనంతరం ధోనీ సరికొత్త ప్లాన్ తో వస్తున్నాడట. కొత్త రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ధోనీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని పనులు చక చకా జరుగుతున్నాయట. ఐపీఎల్ పూర్తయ్యాక వెబ్ సిరీస్ పనుల్లో ధోనీ పాల్గొంటాడట. ధోనీ, ఆయన సతీమణి కలిసి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఉండనుందట్. మొత్తానికి క్రికెట్ ద్వారా అందరికీ దగ్గరైన ధోనీ సినిమాలతో మరింత దగ్గరవుతాడన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news