పూజ హెగ్డే: నేను దానికోసం కక్కుర్తి పడను ..!!

-

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటారు. అలాంటి పనే హీరోయిన్ పూజ హెగ్డే చేస్తోంది.తెలుగు సినిమా దర్శకుల లో గురూజీ ని గట్టిగా నమ్ముతోంది.

తెలుగు సినిమాలో పూజా  కనిపించి చాలా కాలం అయ్యింది. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా భారీ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ ఫ్లాపవ్వడంతో తన గ్రాఫ్ తగ్గింది. పూజా ఇప్పుడు మహేష్ బాబు -త్రివిక్రమ్ ల SSMB28తో తిరిగి మళ్లీ లైన్ లో పడేందుకు చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో అంతకంతకు ఆలస్యమవుతోంది. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో చేసిన సర్కస్ పైనే ఆశలు పెట్టుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ ను రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక సినిమాలు ప్లాప్ అవుతున్నా రెమ్యూనరేషన్ పెంచుతుంది అన్న ప్రచారం పై పూజ స్పందిస్తూ.. రేమ్యూనరేషన్ కోసం నిర్మాతలను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ,నిజానికి నేను ఎలాంటి రెమ్యూనరేషన్ పెంచలేదని తెలిపింది. ఇక రెమ్యునరేషన్ కోసమే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉండేది,కానీ నేను డబ్బుకోసం ఇండస్ట్రీలోకి రాలేదు , అంత ఆశ నాకు లేదు అని అంది పూజాహెగ్డే. నాకు పాత్ర నచ్చితే తరువాత రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news