మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీద ఇన్ని అనుమానాలా.. పాపం కదా ..!

-

కియారా అద్వాని… బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో కియారా అద్వాని నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వెంటనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో వచ్చిన ఆఫర్ తో అందరూ కియారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలవుతుందనే భావించారు.

కానీ బ్యాడ్ లక్ ఏంటో గాని వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా మిగిలింది. అంతే ఇక కియారా కి మళ్ళీ టాలీవుడ్ లో సినిమా ఛాన్స్ రాలేదు. బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో తీసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది కియారా అద్వాని. ఈ వెబ్ సిరీస్ లో కూడా రాధికా ఆప్టే, మనీషా కోయిరాల, నేహా ధూపియా, సంజయ్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా పాపులర్ అయింది మాత్రం కియారా నే. ఆ తర్వాత తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది.

ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీబాంబ్’ అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కియారా. అక్షయ్ కుమార్ తో రెండవ సినిమా. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. పాత్రలో కామెడి ఎక్కువగా పండించాల్సి ఉంది. అయితే ఇది కియారా ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని అందరూ కాస్త సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటుంగ్ మొదలై చాలా భాగం పూర్తవ్వాల్సింది. కాని ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో నెలకొన్న పరిణామాలతో అన్నీ ఇండస్ట్రీస్ లో షీటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. లక్ష్మీ బాంబ్ లో ఛాలెంజింగ్ రోల్ కావడం తోనే కీయారా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నా కూడా ఇలా అనుమానం వ్యక్తం చేయడం పాపం అంటు కొంతమంది కియారాకి సపోర్ట్ గా మాటలాడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version