అచ్చం ర‌వివ‌ర్మ పెయింటింగ్ లాగే.. త‌న కూతుళ్ల‌ను అలంక‌రించింది ఆ మ‌హిళ‌..!

-

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న జ‌నాలు త‌మలోని టాలెంట్ల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. కొంద‌రు త‌మ హాబీల‌కు అనుగుణంగా త‌మ‌కిష్ట‌మైన ప‌నులు చేస్తుంటే.. మరికొంద‌రు త‌మ‌లోని కొత్త నైపుణ్యాల‌ను వెలికి తీస్తున్నారు. అందులో భాగంగానే ఆ మ‌హిళ కూడా త‌న కుమార్తెల్లో దాగి ఉన్న సృజనాత్మ‌క‌త‌ను వెలికి తీసేందుకు వారికి వెరైటీగా గెట‌ప్‌లు వేసింది. 19 శ‌తాబ్దానికి చెందిన ప్ర‌ముఖ చిత్ర‌కారుడు రాజా ర‌వి వ‌ర్మ పెయింటింగ్‌ల‌ను పోలిన వేష‌ధార‌ణ‌ల‌తో త‌న కుమార్తెలను అలంక‌రించింది. అనంత‌రం వారి ఫొటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అవిప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

mother dressed her daughters like ravi varma paintings

బహ్రెయిన్‌లో నివాసం ఉంటున్న కేర‌ళ వాసి శీత‌ల్ జియో త‌న ఇద్ద‌రు కుమార్తెలు క్యాథ‌రిన్ (4) క్లేర్ (7)ల‌ను ర‌వివ‌ర్మ పెయింటింగ్‌ల‌లోని మ‌హిళ‌ల్లా అందంగా అలంక‌రించింది. అందుకు ఆమె ఎంత‌గానో శ్ర‌మ ప‌డింది. అచ్చం ఆ పెయింటింగ్‌ల‌లో ఉన్న మ‌హిళ‌ల లుక్ వ‌చ్చేలా త‌న కుమార్తెల‌ను అలంక‌రించింది. త‌రువాత వారిని ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌గా.. వాటికి ఇప్ప‌టికే 600కు పైగా లైకులు, కామెంట్లు వ‌చ్చాయి. ఇంకా ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో షేర్ అవుతూనే ఉన్నాయి.

కాగా శీత‌ల్ ఈ సంద‌ర్భంగా స్పందిస్తూ… త‌న‌కు ర‌వివ‌ర్మ పెయింటింగ్స్ అంటే ఎంత‌గానో ఇష్ట‌మ‌ని.. అందుక‌నే త‌న కుమార్తెల‌ను ఇలా తీర్చిదిద్దానని చెప్పింది. మ‌రి లాక్‌డౌన్ స‌మ‌యంలో మీరేం చేస్తున్నారు..? నిత్యం ఎదుర‌య్యే ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే.. ఇలాగే ఏదో ఒక క్రియేటివ్ ప‌ని చేయండి మ‌రి..!

Read more RELATED
Recommended to you

Latest news