దారుణం : ఏకంగా పదిహేడు మంది గ్యాంగ్ రేప్

-

జార్ఖండ్‌ రాజధాని రాంచీకి ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డుమ్కా జిల్లాలో ఒక మహిళ భర్తను బందీగా ఉంచి ఆమె మీద 17 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఐదుగురు పిల్లల తల్లి. ఈ మేరకు ఆ మహిళ బుధవారం ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ప్రాణాలతో బయటపడిన ఆ మహిళ ఫిర్యాదు మేరకు 17 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, సంతల్ ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి), సుదర్శన్ మండల్, దుమ్కా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అంబర్ లక్రా బాధితురాలి గ్రామాన్ని సందర్శించి ఈ విషయంపై దర్యాప్తు జరిపారు. మంగళవారం రాత్రి ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదరు మహిళ తన భర్తతో కలిసి వారపు గ్రామ సంత నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ నేరం జరిగింది. “మహిళ చెబుతున్న దాని ప్రకారం, మంగళవారం రాత్రి మార్కెట్ నుండి తన భర్తతో తిరిగి వెళుతుండగా, 17 మంది ఆమెను అడ్డగించి, భర్తను బందీగా తీసుకున్నారు అనంతరం ఆమె మీద పదిహేడు మంది దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news