నడిచే నేల, పీల్చే గాలి, బతుకుతున్న దేశం.. అన్నీ వారి వల్లే -రాంచరణ్

-

అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో సినీ నటుడు రాంచరణ్ తేజ పాల్గొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు రాంచరణ్ తేజ. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను జరుపుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టమన్నారు రాంచరణ్ తేజ.

మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి కారణమన్నారు రాంచరణ్ తేజ. దేశ సైనికుల ధైర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని.. మనం నడిచే నేల పీల్చే గాలీ బతుకుతున్న దేశం మీద వీర జవాన్ల చెరగని సంతకం ఉంటుందన్నారు. వీరుల త్యాగాలను ఎవరు మరిచిపోవద్దని.. దేశం ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వలనే అని తెలిపారు రాంచరణ్ తేజ. నేను నటించిన ధ్రువ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు రాంచరణ్ తేజ.

Read more RELATED
Recommended to you

Latest news