జపాన్ పర్యటనకు ఎంపీ అవినాష్ రెడ్డి.. హైకోర్టులో పిటిషన్

-

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తాలూకా నిబంధనలను తొలగించాలని దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ కండిషన్ లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.

MP Avinash

ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో దేశం విడిచి వెళ్ళవద్దని అవినాష్ కి షరతు విధించింది హైకోర్టు. అనుమతి లేకుండా ఏపీలో అడుగు పెట్టవద్దని భాస్కర్ రెడ్డికి షరతు విధించింది. అయితే బెయిల్ మంజూరు షరతులను ఎత్తివేయాలని కోరారు ఎంపీ అవినాష్, భాస్కర్ రెడ్డి. ఈనెల 26 నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జపాన్ పర్యటనకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి.

అయితే ఈ వాదనలపై వైఎస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ షరతులు సడలించవద్దని సిబిఐ వాదనలు వినిపించింది. దీంతో సిబిఐ కోర్టును ఆశ్రయించాలని అవినాష్ రెడ్డికి హైకోర్టు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news