తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు – వైసీపీ ఎంపీ

-

వైసీపీ పార్లమెంట్‌ సభ్యులు ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయం అంటున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు కానీ, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మధ్య కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జరగవచ్చన్నారు. 2024 లో జరిగే పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవనేది ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే తేటతెల్లం అవుతుందన్నారు. 100 రోజులే ఎన్నికలకు సమయం అని చెబుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు ఈసారి మూటలు, మాటల రాజకీయాలకు పడిపోరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news