తల తెగనరకమన్న వైసీపీ ఎంపీ.. ఏం జ‌రిగిందంటే..

-

అనంతపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో చంపేవాడు, చచ్చేవాడు బోయలేనన్నారు. ఉసి గొల్పేవారి తల తీసేయండని వైసీపీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. బోయలు బోనులో నిలబడకూడదని, న్యాయూర్తులుగా ఎదగాలని తలారి రంగయ్య పిలుపు నిచ్చారు.

రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తతతో బోయలు వ్యవహరించాలని ఆయన కోరారు. ఉసిగొల్పేవాడి తలతీసేస్తే తాము తగవులాడుకోవాల్సిన పని ఉండదన్నారు. గాయాలపాలై డాక్టర్ల దగ్గరకు వెళ్లేకంటే మనమే డాక్టర్లుగా మారాలని తలారి రంగయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news