MP Vijayasai Reddy: మూడు లిస్టులు రిలీజ్ చేశాం.. త్వరలో మరో జాబితా..

-

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడు బాలినేని అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీలో ఆయనకున్న స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు జాబితాలు ఇప్పటికే విడుదల చేశాం.. త్వరలో మరో జాబితా ఉంటుందని విజయసాయి రెడ్డి తెలిపారు . పొలిటికల్ పార్టీలు అన్న తర్వాత పరస్పర ఆరోపణలు సహజమని, ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారని విజయసాయిరెడ్డి అన్నారు. మా నాయకుడ్ని టీడీపీ నేతలు విమర్శిస్తే తిప్పికొట్టడం మా బాధ్యత అంటూ ఆయన తెలిపారు.

వైఎస్ మరణంపై గతంలోనే విచారణ జరిగింది. ఆ రిపోర్టును అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని . గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎలా గెలిచారో అన్నీ రుజువులు అప్పగించామని విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news