విజయసాయి ట్వీట్.. ‘కాబోయే సీఎం’గా లోకేశ్ సైకిల్ యాత్ర..!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? ఎట్టకేలకు చంద్రబాబు సైకిల్ దిగబోతున్నారా..? ఇకపై పార్టీని లోకేషే నడిపించబోతున్నారా..? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే ఎవరికైనా ఇవే ప్రశ్నలు కలుగుతాయి. నిత్యం చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..

‘‘పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం’గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట.’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా లోకేశ్ సైకిల్ యాత్రకు సంబంధించి వార్తలు బాగా వస్తున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి కూడా దీనిపై మాట్లాడటంతో ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version