అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబ్ బెదిరింపు.. టెన్షన్.. టెన్షన్..!

-

ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటి బాంబు బెదిరింపు కలకలం రేగింది. అబితాబ్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాదు ముంబై నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అమితాబ్ ఇంటితో పాటు రైల్వేస్టేషన్లో క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అయితే అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టామని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఫోన్ కాల్ ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆకతాయిల పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news